శర్మ కాలక్షేపంకబుర్లు-కుదుపు.

కుదుపు.

కరోనా వైరస్ మానవ జీవితాలని ఒక కుదుపు కుదిపింది.ఏ జీవికైనా ఆహారము,నిద్ర,మైధునము సర్వ సహజ జీవ లక్షణాలు. మానవుడు నాగరికత నేర్చి ఇల్లుకట్టుకోవడం నుంచి అనేకం నేర్చాడు, కాని నేడు నాగరికత పేరున వెర్రిన పడుతున్న వారిని కరోనా ఒక్క కుదుపు కుదిపి మానవులబలహీనతెంతో చెప్పకనే చెప్పింది. సంపాదించుకుంటున్న భూములు,బంగారాలు, వజ్రాలు కట్టుకున్న ఇళ్ళు ఏవీ  కూడా రావని వీటి విలువ గుడ్డిగవ్వ విలువ చేయదని వాటి వెనకపడిపోవద్దనే ఒక హెచ్చరిక ఇచ్చింది.స్వంతలాభం కొంతమానుకు పొరుగువానికి సాయపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది నిజం చేదాం. గుర్తుకు తెచ్చుకుందాం.కలసికట్టుగా నిలుద్దాం,బ్రతుకుదాం. స్వంతలాభం కొంతమానుకు పొరుగువానికి సాయపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది నిజం చేదాం. గుర్తుకు తెచ్చుకుందాం.కలసికట్టుగా నిలుద్దాం,బ్రతుకుదాం.  

మానవ చరిత్రలో, మానవుడు ఇలా ఇంటిలో దాక్కుని కూచుని వుండే సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఇదే మొదటిసారి అనుకుంటాను.లాక్ డవున్ పదునాల్గుతో పూర్తి అవుతోంది.ముందు ఏం జరగనుందీ తెలియదుప్రపంచం మొత్తం మీద ఈ మహమ్మారి బారిన పడి చనిపోయినవారు ఒక లక్షపైన ఉండచ్చు. ఇప్పటికి మహమ్మారిని మానవాళిపై వదలినవారికి ఆత్మ పరిశీన లేనట్టే వుంది. ఈ మహమ్మారి మానవాళినే తుడిచిపెట్టేలా ఉంది. దీని భయంకర రూపం ఇప్పటికి కొంతమందికి నేటికీ తెలియకపోవడమే వింత, ఎంత చెప్పినా .

చనిపోయినవారి కి ఉత్తరగతులు కలిగేలా ప్రార్ధన చేయడమే మిగిలినవారు చేయగలది. ఇంతకు ముందు మానవాళి చరిత్రలో ఇటువంటి సంఘటన జరుగలేదు గనక ఈ ఏప్రియల్ నెలను అంతర్జాతీయ శోకమాసంగా ప్రకటించి, ఇకముందు ప్రతి సంవత్సరమూ ఏప్రియల్ నెలను ప్రపంచ వ్యాప్తంగా లాక్ డవున్ ప్రకటించాలని నా కోరిక.

వ్యాఖ్యానించండి